నేడు విజయవాడలో సీఎం జగన్ పర్యటన.. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభం

-

నేడు విజయవాడలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం వైఎస్‌ జగన్ తో పాటు, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కూడా విజయవాడలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు రహదారులు, ఇతర ప్రాజెక్ట్‌ల ప్రారంభం, భూమి పూజ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ముఖ్యగా విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ పశ్చిమ ఫ్లై ఓవర్‌ ప్రారంభం చేయనున్నారు సిఎం జగన్ మోహన్ రెడ్డి.

మధ్యాహ్నం 12.05 గంటలకు ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంకు గడ్కరీ, జగన్ చేరుకోనున్నారు. ఎన్ హెచ్ డీ ఐ నిర్మించిన 20 రహదారులు, ఇతర ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నారు గడ్కరీ, జగన్ మోహన్ రెడ్డి. అలాగే 31 జాతీయ రహదారుల ప్రాజెక్ట్‌లకు భూమి పూజ నిర్వహించనున్నారు.

అనంతరం బహిరంగసభలో పాల్గొననున్నారు నితిన్‌ గడ్కరీ, సీఎం జగన్. మధ్యాహ్నం 1.55 గంటలకు బెంజ్‌ సర్కిల్‌కు చేరుకోనున్నారు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ. అనంతరం కొత్త గా నిర్మించిన పశ్చిమ దిశ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నారు నితిన్ గడ్కరీ,

Read more RELATED
Recommended to you

Latest news