వైఎస్ సునీతకు సీఎం జగన్ బంపర్ ఆఫర్ !

-

వైయస్ వివేకానంద రెడ్డి కూతురు వైయస్ సునీతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. ఆమెకు అసెంబ్లీ సీట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాల్సిందేనని పోరాడుతున్న సునీతతో రాజీ కోసం వైసిపి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

ఇందులో భాగంగానే ఆమెకు అసెంబ్లీ టికెట్ ఆఫర్ చేశారని… కుటుంబ సన్నిహితుల ద్వారా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. జమ్మలమడుగు అసెంబ్లీ సీట్లు ఇస్తామని వైసిపి సునీతకు ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

ఈ ప్రతిపాదనలు ఇలా పెట్టగానే అలా సోషల్ మీడియాలో ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే జగన్ పులివెందుల సీటు ఇస్తామంటున్నారని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అలాంటి పరిస్థితి ఉంటుందని ఎవరు నమ్మడం లేదు. మొత్తానికి సునీతతో రాజీ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది వైసిపి. కాగ గతంలో వైఎస్ సునీత టిడిపి పార్టీలోకి వెళ్తారని… సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news