పవన్ కళ్యాణ్ గురించి పిఠాపురంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

-

పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా పిఠాపురంలో నిర్వహించిన రోడ్డుషోలో పాల్గొని మాట్లాడారు. పిఠాపురంలో పోటీ చేస్తున్న దత్త పుత్రుడికి ఓటు వేయకూడదో మీ బిడ్డ జగన్ చెబుతాడు. సాధ్యం కానీ హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చాడు. గతంలో ఎన్నడూ చూడని విధంగా పథకాలు ఇస్తే.. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను చూస్తే.. 1,60,000 ఇస్తానన్నారు. అబద్దాలు చెబుతున్నారని వారికి తెలుసు.

అదే చంద్రబాబుకు కత్తి ఇచ్చి.. అక్కాచెల్లెల్లను పొడవండి అంటున్నాడు. మహిళలు దత్తపుత్రుడిని నమ్మే పరిస్థితి ఉంటుందా..? ఐదేళ్లకొకసారి భార్యలను మార్చే ఈ దత్త పుత్రుడు.. ఎమ్మెల్యే అయితే కలిసే పరిస్థితి ఉంటుందా..? అని ప్రశ్నించారు. దత్తపుత్రుడికి ఓటు వేస్తే.. పిఠాపురంలో ఉంటాడా..? అని అడుగుతున్నా. జలుబు చేస్తే.. హైదరాబాద్ కి వెళ్లిపోయాడు. గాజువాక, భీమవరం, ఇప్పుడు పిఠాపురం వచ్చింది. ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే.. న్యాయం జరుగుతుందా..? అని ప్రశ్నించారు. నా తల్లి, అక్క లాంటి వంగ గీతను గెలిపించండి అని కోరారు. వంగ గీతను గెలిపించండి.. డిప్యూటీ సీఎం చేస్తానని హామీ ఇచ్చారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version