హుజురాబాద్ పై కేసీఆర్ ఫోకస్‌.. ఆడియో టేప్‌ వైరల్‌

-

హుజురాబాద్ ఉపఎన్నికపై తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. తాజాగా హుజురాబాద్ కు చెందిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనగుల ఎంపీటీసీ నిరోష భర్త వాసాల రామస్వామి కి సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. అయితే… సీఎం కేసీఆర్ మరియు ఎంపీటీసీ మధ్య జరిగిన ఆడియో టేప్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

cm-kcr
cm-kcr

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకోస్తున్న దళిత బంధు పథకం గురించి ఫోన్ లో ప్రస్తావించారు సీఎం కేసీఆర్.  హుజురాబాద్ లో దళితబంధు గురించి అన్ని గ్రామాలకు తెలియాలని, ప్రపంచంలోనే అతిపెద్ద పథకమని తెలిపారు సీఎం కేసీఆర్. అయితే… దీనికి సంబంధించిన ఆడియో టేప్‌ వైరల్‌ కావడంతో.. హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి.కాగా.. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఇక బీజేపీ పార్టీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పోటీ చేస్తారని వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news