ఈనెల 12 నుంచి జిల్లాల పర్యటనకు కేసీఆర్

-

ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి జిల్లాల బాట పట్టనున్నారు. ఈనెల 12 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. ఈనెల 12న కొత్తగూడెం, మహబూబాబాద్‌ కలెక్టరేట్లను సీఎం ప్రారంభించనున్నారు. 18న ఖమ్మం కలెక్టరేట్‌ శ్రీకారానికి ముహూర్తం ఖరారైంది. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులకు సీఎంవో నుంచి అధికారిక సమాచారం అందింది.

తొలుత మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ ను ప్రారంభించిన తర్వాత..అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కొత్తగూడెం చేరుకుంటారు. అనంతరం కొత్త కలెక్టరేట్ సముదాయాన్ని సీఎఁ ప్రారంభిస్తారు. కొత్త ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ అనుదీప్‌ను కూర్చొబెట్టి జిల్లా పాలనకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. అదేరోజు బీఆర్ఎస్ జిల్లా పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. వైద్య కళాశాల, ఫార్మసీ కళాశాలను సందర్శించనున్నారు.

ఈనెల18న ఖమ్మం జిల్లా నూతన కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లలో తలమునకలైంది. మరోవైపు 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news