ఠాక్రే ఇలాకాలో కేసీఆర్ ప్లెక్సీల హంగామా.. ఫోటోలు వైరల్

-

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం అయ్యేందుకు కేసీఆర్ ముంబై బయలుదేరారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ముంబై బయలుదేరారు. ఆయన వెంట ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్ రావు ఉన్నారు. ఈరోజు మధ్యహ్నం 1 గంటలకు ఉద్ధవ్ ఠాక్రేతో లంచ్ మీటింగ్ లో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో సమావేశం కానున్నారు. 

ఇదిలా ఉంటే ముంబైలో కేసీఆర్ ప్లెక్సీలతో హంగామా చేస్తున్నారు అభిమానులు. ముంబైలో పలు ప్రాంతాల్లో కేసీఆర్ ప్లెక్సీలు పెట్టారు. ముంబైలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు మహారాష్ట్రకు స్వాగతం పలుకుతూ పోస్టర్లు వెలిశాయి. ఇటీవల కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గుజరాత్ లోని సూరత్ లో, వారణాసి, ఢిల్లీల్లో కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ.. పోస్టర్లు వెలిశాయి. దేశ్ కీ నేత అంటూ కేసీఆర్ అభిమానులు పొగుడుతూ.. ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news