థర్డ్‌ ఫ్రంట్‌ పై సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

-

థర్డ్‌ ఫ్రంట్‌ పై సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన ప్రకటన చేశారు. ప్రస్తుతం థర్డ్‌ ఫ్రంట్‌ లేదని కుండ బద్దలు కొట్టి చెప్పారు సీఎం కేసీఆర్‌. ఇవాళ జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ బిశ్వాంత్‌ తో సమావేశమైన సీఎం కేసీఆర్‌.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణకు చాలా శిబూ సొరేన్ సహకరించాలని సీఎం కేసీఆర్ తెలిపారు.

జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ బిశ్వాంత్‌ తో జాతీయ రాజకీయాలపై చర్చించామని పేర్కొన్నారు.. త్వరలోనే అందర్నీ కలుస్తాం, దేశానికి ఇప్పుడు కొత్త అజెండా కావాలని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఇప్పుడు ఏ ఫ్రంట్‌ లేదు, ఏదైనా ఉంటే చెబుతాం, మేం ఎవరికైనా అనుకూలమో వ్యతిరేకమో కాదు, దేశం బాగుకోసమే మా ప్రణాళిక అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. దేశ ప్రజలకు న్యాయం జరిగేలా తాము ప్రయత్నాలు చేస్తున్నామని.. మోడీ సర్కార్‌ చాలా దుర్మరంగా వ్యవహరిస్తోందని ఆగ్రహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడిదాకైనా వెళతామని కుండ బద్దలు కొట్టి చెప్పారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news