ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

-

తెలంగాణ సీఎం కేసీఆర్ పై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో భజరంగ్ దళ్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నెల 10వ తేదీన నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన సభలో ప్రధాని ప్రసంగించిన తీరుని వివరిస్తూ తెలంగాణలో ఉన్న దేవతలను కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కెసిఆర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ఈ సందర్భంగా బజరంగ్ దళ్ నేత అభిషేక్ మాట్లాడుతూ..”ఆ అంబా ఈ అంబా” అంటూ జోగులాంబ అమ్మవారిని అవహేళన చేసిన తీరు క్షమించరానిదని, ముఖ్యమంత్రి తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందజేయడం జరిగిందని ఆయన వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version