కాంగ్రెస్, బీజేపీలు చెత్త పార్టీలు: మంత్రి ఎర్రబెల్లి

-

మంత్రి మల్లారెడ్డి తో కలిసి మూడు చింతలపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బిజెపి పార్టీలతో ప్రజలకు ఏనాడూ మేలు జరగలేదు అన్నారు. వాళ్లే లాభపడ్డారు, చేతకాని దద్దమ్మలు అని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు చెత్త పార్టీలు. వాళ్ళ వల్లే పెట్రోలు, డీజిల్, నిత్యావసర ధరలు పెరిగాయని ఫైర్ అయ్యారు ఎర్రబెల్లి.

 

వీళ్ల పాలనలో దేశం సర్వనాశనం అయింది అన్నారు. గ్రామాల్లో కనీస వసతులు లేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ వచ్చాక ప్రజలకు మంచి రోజులు వచ్చాయి అన్నారు. ప్రతి గ్రామానికి నీధులు అందే విధంగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు 250 కోట్లు ఇస్తున్నది సీఎం కేసీఆర్ మాత్రమే అన్నారు. పల్లెలు పరిశుభ్రంగా మారి అభివృద్ధిని సాధించాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news