సాగర్లో మాకు మద్దతివ్వండి.. కమ్యూనిస్టు పార్టీలకు కాంగ్రెస్ లేఖలు..!

-

 నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డికి మద్దతు ప్రకటించాలని కోరుతూ కమ్యూనిస్టు పార్టీలకు కాంగ్రెస్ లేఖలు రాసింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  లేఖలు రాసినట్టు చెబుతున్నారు.

అలానే ఫోన్ లో కూడా వారితో కాంగ్రెస్ నేతలు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శులతో చర్చలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి ఈ స్థానంలో ఇప్పటిదాకా కాంగ్రెస్ ఒక్కటే అభ్యర్థిని ఖరారు చేసింది. అధికార టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ తమ అభ్యర్థులను ప్రకటించ లేదు. ఒక పక్క జానారెడ్డి ప్రచార్మలో దూసుకు పోతుండగా మిగతా పార్టీల వాళ్ళు కూడా అభ్యర్థుల పేర్లు చెప్పకుండా ప్రచారం చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news