కాంగ్రెస్ పార్టీ చుక్కాని లేని నావలా తయారైంది – మంత్రి జగదీశ్ రెడ్డి

-

నల్గొండ పట్టణంలోని జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి నివాసంలో మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలనేది దేశ ప్రజల కోరిక…. చారిత్రక అవసరం అని అన్నారు. అభివృద్ధిలో ముందుకు పోతున్న తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మత వైశామ్యాలను రెచ్చగొట్టి భారత దేశం పరువు తీసేలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు జగదీశ్ రెడ్డి.

కాంగ్రెస్ పార్టీ చుక్కాని లేని నావల తయారైందని ఎద్దేవా చేశారు. దేశం వెనుకకు పోకుండా… ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారని అన్నారు. భరతమాత కోసం త్యాగం చేసేందుకు ఎవరో ఒకరు ముందు పడక తప్పదు.. తెలంగాణ రాష్టాన్ని సాధించిన కేసీఆర్ నాయకత్వంలోనే పని చేసేందుకు అంతా సిద్ధంగా ఉన్నామన్నారు. లక్ష్య సాధనలో నల్గొండ జిల్లా ప్రజల పోరాటాలు మరువలేనివని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news