నేడు కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్షలు..

-

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకంపై నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అయితే.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ ను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే కడ్తాల మండల కేంద్రంలో ఆదివారం పెద్దఎత్తున నిరసన చేపట్టారు. మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు యాట నర్సింహ ఆద్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ జెండాలతో హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్‌ కూడలిలో దర్నా, రాస్తారోకో చేశారు.

Major humiliating defeat of Congress candidate in MLC elections- The New  Indian Express

ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దహనం చేసి బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నేనావత్‌ బీక్యానాయక్‌, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు జహంగీర్‌బాబా, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పూల శంకర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాంచందర్‌నాయక్‌, సర్పంచులు సేవ్య బావోజి, రాము నాయక్‌, నాయకులు లక్ష్మణ్‌, ఇమ్రాన్‌బాబా, మల్లేశ్‌గౌడ్‌, హీరాసింగ్‌, మహేశ్‌, రాజేశ్‌, తులసీరామ్‌, బోసు రవి, రాజేందర్‌గౌడ్‌, అంజయ్య పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news