కరోనా విలయం: ఇకపై మాస్క్ ధరించడం తప్పనిసరి… లేదంటే ప్రాణాంతకమే !

-

దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతూ వస్తున్నాయి. గతంలో కరోనా వలన ఎంత ఇబ్బంది పడ్డామో ? ఎంత మంది తమ ప్రాణాలను కోల్పోయారో తెలిసిందే. అప్పుడు ఈ పరిస్థితుల నుండి బయటపడుతామా అంటూ ఏడవని భారతీయుడు లేరనే చెప్పాలి. కంటికి కనిపించని ఈ మహమ్మారి వైరస్ వలన ఇండియాలో లక్షల మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఇప్పుడు సరిగ్గా అలాంటి ప్రమాదకర పరిస్థితి ఎదురవుతుందా అంటే డాక్టర్స్ అవుననే అంటున్నారు.

చైనాలోనే కేసులు ఉన్నాయని అనుకున్న అతి తక్కువ కాలంలోనే ఇండియాకు కూడా కేసులు వచ్చేశాయి. ఒక రోజుకి వందల సంఖ్యలో కేసులు వచ్చే స్థాయి నుండి ఇప్పుడు వేల సంఖ్యలో రోజువారీ కేసులు నమోదు అవుతున్నాయి. దీనితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాస్క్ ను ధరించడం తప్పనిసరి చేస్తూ వస్తున్నాయి, లేదంటే మళ్ళీ పూర్వం పరిస్థితులు వచ్చే ప్రమాదం లేకపోలేదు.

Read more RELATED
Recommended to you

Latest news