3 కోట్ల 2 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. తాజాగా!

-

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మొత్తం 3 కోట్ల 1లక్ష 83 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయింది. గడచిన 24 గంటలలో 48 వేల 698 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక దేశంలో నమోదు అవుతున్న మరణాల సంఖ్య చూస్తుంటే ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 1,183 మంది మృతి చెందారు.

దేశ వ్యాప్తంగా 64,818 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. ఇంకా 5 లక్షల 95 వేల 565 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకూ కరోనా చికిత్స పొంది 2 కోట్ల 91 లక్షల 93 వేల 085 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వల్ల దేశంలో మొత్తం 3 లక్షల 94 వేల 493 మృతి చెందారు. దేశంలో 96.72 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉంది. మొత్తం కేసుల్లో 1.97 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరణాల రేటు 1.31 శాతంగా ఉంది. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 61 లక్షల 19 వేల 169 మంది కరోనా వాక్సిన్ తీసుకున్నారని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news