BREAKING : పరిటాల శ్రీరామ్‌కు కరోనా పాజిటివ్‌..

-

ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, సెలబ్రిటీ లు పడ్డారు. ఇక తాజాగా టీడీపీ సీనియర్ నేత పరిటాల శ్రీరామ్… కరోనా బారిన పడ్డారు. కరోనా సోకడంతో… ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు పరిటాల శ్రీరామ్. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు.

” కరోనా పరీక్షల్లో స్వల్ప లక్షణాలతో నాకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన మా శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా లక్షణాలు కనబడితే కరోనా పరీక్షలు చేయించుకోవాలి. మాస్కులు, భౌతిక దూరం పాటించాలి” అంటూ పరిటాల రవి ట్వీట్ చేశారు.కాగా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… టిడిపి నేతలు వంగవీటి రాధా, పయ్యావుల కేశవ్, ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు. దీంతో వారంతా హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news