రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ ?

-

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు ఇప్పుడూ మళ్లీ విజృంభిస్తున్నాయి. అటు ప్రముఖులు కూడా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు సమాచారం అందుతోంది. ఆయన ప్రస్తుతం కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు.

దీంతో హోమ్ ఐసోలేషన్ లో రేవంత్ రెడ్డి ఉన్నారు. దీంతో ఆయన ఇవాళ మునుగోడు నియోజకవర్గంలో జరిగే పాదయాత్రకు హాజరు కావడం లేదు. రేవంత్ రెడ్డి ఈ పాదయాత్రకు హాజరు కావడంలేదని కాసేపటికి క్రితమే ఆయన కార్యాలయం సిబ్బంది ప్రకటించింది. దీంతో జానారెడ్డి ఇతర సీనియర్ నాయకులు ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news