దేశంలో వందశాతం కరోనా వ్యాక్సినేటెడ్ జిల్లా ఏదో తెలుసా…?

-

దేశంలో కరోనా అంతానికి వ్యాక్సినేషన్ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం వేగం చేసింది. వివిధ రాష్ట్రాలు తమ ప్రజలకు కోవిడ్ టీకాలను ఇస్తున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లా వందశాతం కోవిడ్ టీకా వేసిన జిల్లాగా రికార్డ్ స్రుష్టించింది. ఈ జిల్లాలో కోవిడ్ టీకా తీసుకునే అర్హత ఉండి, 18 ఏళ్లకు పైబడిన వారందరికీ టీకాలు అందాయి. అంతకుముందు గత ఆగస్టులోనే కిన్నౌర్ జిల్లాలోని 18 ఏళ్లకు పైబడిన ప్రజలంతా మొదటి డోసు కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య వందశాతాన్ని చేరింది. అర్హులైన వారికి టీకాలు అందించాలనే మా లక్ష్యం నెరవేరిందని కిన్నౌర్ జిల్లా కలెక్టర్ అబిద్ హుస్సేన్ సాధిక్ అన్నారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం 96.82 కోట్ల డోసుల టీకాను వేసినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. గత సెప్టెంబర్ లో దాద్రా నగర్ హవేలీ, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, గోవా, లడఖ్, లక్షద్వీప్ లోని 18 ఏళ్లకు పైబడిన వారందరికి మొదటి డోసు టీకా అందినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news