నేటి నుంచి హన్మకొండ లో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు

-

వరంగల్ : నేటి నుంచి హన్మకొండ లో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరు కానున్నారు. బాలవికాసలో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలకు ఏర్పాట్లు చేసిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్ట్) సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు సోమవారం నుంచి మూడు రోజుల పాటు హనుమకొండ వేదికగా జరగనున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండలో సమావేశాలు నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కమిటి నిర్ణయించింది. హనుమకొండలోని ఫాతిమానగర్ బాలవికాసలో నిర్వహించబోయే రాష్ట్ర కమిటి సమావేశాలకు అన్నిఏర్పాట్లను పూర్తి చేశారు. సోమవారం ప్రారంభ సమావేశాలకు సీపీఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు, విజయరాఘవన్లు ముఖ్యఅతిధులుగా హాజరవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news