9వ తరగతి బాలికను బంధించి.. మూడు నెలల పాటు లైంగిక దాడి !

-

దేశంలో మహిళలపై లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా… ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఏమాత్రం తగ్గడం లేదు. అయితే తాజాగా జార్ఖండ్  లో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి బాలికను బంధించి.. మూడు నెలల పాటు లైంగిక దాడి చేశారు.

బాలిక-అత్యాచారం
బాలిక-అత్యాచారం

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..జార్ఖండ్లోని బోకార ప్రాంతానికి చెందిన తొమ్మిదవ తరగతి బాలికను మనోజ్ , విష్ణు, మంథోష్ అనే ముగ్గురు వ్యక్తులు అపహరించారు. గదిలో బంధించి మూడు నెలల పాటు సామూహిక అత్యాచారం చేశారు.

జూలై 19వ తేదీన బాలికను ఓ మహిళ విడిపించింది. ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు బాలిక అసలు విషయం చెప్పింది. గతంలో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన తల్లిదండ్రులు తాజాగా మరోసారి పోలీసులకు ఈ దారుణంపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news