భాగ్య లక్ష్మి టెంపుల్‌ కు రానున్న ప్రధాని మోడీ !

-

నిన్న జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో ప్రధాని నరేంద్ర మోడీ…సమావేశం అయిన సంగతి తెలిసిందే. వీరి సమావేశం దాదాపు గంటన్నర పాటు జరిగింది. అయితే..ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ… ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.

మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు కలవలేకపోయానని కార్పొరేటర్లతో పేర్కొన్నారు. కార్పొరేటర్ బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నారని అడిగిన ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రజలకు అందుబాటులో వుంటున్నారా అని ఆరా తీశారు. బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని కార్పొరేటర్లకు సూచించిన ప్రధాని.. జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లపై ఆరా తీశారు.

అంతేకాదు.. హైదరాబాద్ కు త్వరలోనే వస్తా.. మళ్లీ కలుస్తానని జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అయితే… ఈ సందర్భంగా.. పాత బస్తీలోని భాగ్య లక్ష్మి దేవాలయానికి రావాలని ప్రధాని మోడీని కోరారు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు. దానికి నవ్వుతూ.. చూద్దాం లే అంటూ సమాధానం ఇచ్చారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news