తల్లితో అక్రమ సంబంధం..మర్మాంగం కోసేసిన కూతురు

-

దేశంలో రోజు, రోజుకు అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఈ అక్రమ సంబంధాల కారణంగా.. ఒకరినొకరు హత్య చేసుకోవడం, కుట్రలు, కుతంత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే.. తాజాగా తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని… ఓ వ్యక్తి మర్మాంగాన్ని కోసేసింది ఓ యువతి. ఈ సంఘటన ఏపీలోని గుంటూరులోని తెనాలి చోటు చేసుకుంది.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే… బాపట్ల జిల్లా తుమ్మలపాలెం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి రెండేళ్ల క్రితం తెనాలి వచ్చాడు. అతడికి ఐతానగర్‌కు చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం ఉంది. రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఓ లాడ్జిలో నివాసముంటూ కూలి పనిచేసే రామచంద్రారెడ్డి సోమవారం రాత్రి సదరు మహిళతో కలిసి మద్యం సేవించి.. అనంతరం ఆమె నివాసం ఉండే భవనంపై నిద్రస్తున్నాడు.

తన తల్లితో అక్రమ సంబంధంపై ఎప్పటి నుంచో ఆగ్రహం తో ఉన్న సదరు మహిళ కుమార్తె.. తన ప్రియుడడితో కలిసి రామచంద్రారెడ్డిపై దాడి చేసింది. ఓ బ్లేడ్‌ తీసుకుని.. అతని మర్మాంగం కోసేసింది ఆ యువతి. ప్రస్తుతం గుంటూరు ఆస్పత్రిలో రామచంద్రారెడ్డి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news