ఒకే మహిళపై 5గురు లైంగిక దాడి..వీడియోలు తీసి మరీ !

-

దేశంలో మహిళలపై లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం, పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా.. కామాంధులు దారుణాలకు ఒడిగడుతున్నారు. అయితే.. తాజాగా ఉత్తర ప్రదేశ్‌ లో దారుణం చోటు చేసుకుంది. షాజహాన్‌ పూర్‌ లో ఓ మహిళను ఐదుగురు కామాంధులు ఇంటిలోపలికి లాక్కెళ్లి దారుణానికి ఒడిగట్టారు.

ఆమెను వరుసగా ఒక్కొక్కరూ లైంగిక దాడి చేసి.. ఆ తర్వాత వీడియో తీశారు. ఈ ఘటన ఏప్రిల్‌ 22వ తేదీన జరుగగా బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువతిని నిందితులు బెదిరించగ సాగారు.

పోలీసులకు చెబితే వీడియో వైరల్‌ చేస్తామని ఆమెను మరోసారి వేధింపులకు పాల్పడ్డారు. తనకు జరిగిన దారుణాన్ని యువతి పోలీసులకు తెలుపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు వీడియోను వైరల్‌ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని.. వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news