యువ‌తి గొంతుకోసి ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్న‌ ఆటోడ్రైవ‌ర్

-


గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యువతి గొంతు కోసి హత్య చేసిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపింది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలోని రాజుపాలెం మండలం రెడ్డిగూడెం శివారులో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. సత్తెనపల్లి మండలం నందిగామకు చెందిన మౌలాలి అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఎల్లమ్మ అనే యువతిని దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న మౌలాలి, ఎల్లమ్మలను ప్రేమికులుగా భావిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news