మొబైల్ కు బానిసై.. కన్నబిడ్డలనే చంపిన తల్లి కేసులో సరికొత్త విషయాలు వెలుగులోకి!

-

మొబైల్ కు బానిసయింది. అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త, పిల్లల కంటే మొబైల్ ఫోన్, ప్రియుడినే అపురూపంగా చూసుకునేది. ఫోన్ కు, ప్రియుడికి బానిస గా మారిన ఆమె.. ప్రియుడి కోసం సైకోగా మారింది. తమ ఏకాంతానికి అడ్డొస్తున్న పిల్లలను, భర్తను చంపేయాలని పథకం పన్నింది. చివరకు తన బిడ్డలను హత్య చేసింది. జస్ట్ లో తన భర్త మిస్సయ్యాడు. దీంతో తన బాగోతమంతా బయటపడింది.

కొద్దిరోజుల క్రితం తన పిల్లలను చంపిన చెన్నై శివారు కుండ్రత్తూరుకు చెందిన అభిరామి కేసులో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అభిరామి భర్త విజయన్ బ్యాంకు ఉద్యోగి కాగా.. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే.. అభిరామి కుండ్రత్తూరులో ఓ హోటల్ లో పనిచేసే ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. రోజూ గంటలు గంటలు ప్రియుడితో వీడియో కాల్ లో మాట్లాడేది. ఆసమయంలో తన పిల్లలు తనను డిస్టర్బ్ చేస్తే వాళ్లను తీవ్రంగా కొట్టేది. అలా.. సైకోగా మారిన అభిరామి వాళ్ల పీడ విరగడ చేసుకోవాలనుకుంది. దీంతో తన ఇద్దరు పిల్లలకు పాలల్లో విషం కలిపి తాగించింది. తన భర్తకు కూడా అవే పాలను తాగించాలని తన ప్లాన్. కానీ.. ఆరోజు రాత్రి విజయన్ ఇంటికి రాలేదు. తెల్లారి వచ్చి చూసేసరికి ఇంట్లో భార్య లేకపోవడం, ఇద్దరు పిల్లలు చనిపోయి ఉండటాన్ని విజయన్ చూసి షాకయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు అభిరామి కోసం గాలించారు.

స్థానికుల సమాచారం మేరకు అభిరామి ప్రియుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అభిరామి ఆచూకీని అతడు చెప్పడంతో నాగర్ కోయిల్ బస్టాండ్ లో అభిరామిని అదుపులోకి తీసుకొని చెన్నైకి తరలించి తనను విచారించగా ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news