దారుణం: అప్పు తీర్చమంటే కారుతో తొక్కించి హత్య చేసిన స్నేహితుడు

-

ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా వెలిగండ్లలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తీసుకున్న అప్పును తీర్చమన్నందుకు కారుతో తొక్కించి హత్య చేశాడు ఓ కిరాతకుడు. కోటా రాధిక అనే యువతి వద్ద కేతిరెడ్డి కాశిరెడ్డి 80 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తీర్చమని రాధిక చాలాకాలం నుండి అడుగుతుండగా దాటవేస్తూ వస్తున్నాడు కాశిరెడ్డి. ఈ క్రమంలోనే మంగళవారం తన అప్పు తీర్చమని రాధిక అడగడంతో డబ్బులు ఇస్తానని పిలిపించి ఆమె కాళ్ళ పై నుండి కారుతో తొక్కించాడు కాశిరెడ్డి.

ఆమె కాళ్ళు విరిగి నడవలేని స్థితిలో ఉన్నా కూడా కనికరం లేకుండా.. ఆమె చాతిపై నుండి కారుతో తొక్కించాడు. అనంతరం సిగరెట్లతో కాల్చి, ఆమె ఎక్కడ బతుకుతుందో అనే అనుమానంతో మొహం మీద బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఇక తన కుమార్తె కనిపించడం లేదని రాధిక తండ్రి సుధాకర్ రెడ్డి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహం జిల్లెలపాడు సమీపంలోని రోడ్డు పక్కన కనిపించింది. అయితే తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించడం ఇష్టం లేకే కాశిరెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని రాధిక తల్లిదండ్రులు సుధాకర్ రెడ్డి, తల్లి సుబ్బలక్ష్మి ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news