15 ఏళ్ల బాలికతో విపరీతంగా శృంగారం..ప్రెగ్నెన్సీ రావడంతో !

-

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో యువకుడి మాటలు నమ్మిన అమ్మాయి పెళ్లి కాకుండానే గర్భవతి అయింది. అయితే ఈ విషయాన్ని బయటకు పోక్కనివ్వకుండా జాగ్రత్త పడాలని చూసేందుకు ప్రియుడు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. నర్సాపూర్ మండలంలోని తండాకు చెందిన 21 సంవత్సరాల శత్రు నాయక్ అదే తండాకు చెందిన 15 ఏళ్ల అమ్మాయిని ప్రేమించాడు. ఆమెతో సాన్నిహిత్యం పెంచుకొని శారీరకంగా దగ్గరయ్యాడు. అమ్మాయికి పూర్తిగా తెలిసి తెలియని వయసును అడ్డుపెట్టుకొని తన కోరికను తీర్చుకున్నాడు.

బాలిక-అత్యాచారం
బాలిక-అత్యాచారం

అమ్మాయితో పలుమార్లు శారీరకంగా కలవడంతో ఆమె గర్భవతి అయింది. విషయం మూడో కంటికి తెలియకుండా ఉండాలని శత్రునాయక్ ఐదు నెలల గర్భవతిగా ఉన్న అమ్మాయికి టాబ్లెట్లు వేస్తే గర్భం పోతుందని అబార్షన్ చేయించే అవసరం ఉండదని భావించాడు. అయితే అమ్మాయి వయసు 15 సంవత్సరాలు కావడంతో టాబ్లెట్లు వికటించి అధిక రక్తస్రావం అయింది. పరిస్థితి సీరియస్ గా మారడంతో కుటుంబ సభ్యులు ఆమెను బుధవారం సాయంత్రం నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితురాలు పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్పడంతో సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితురాలికి అబార్షన్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news