హైదరాబాదర్ లో దారుణం.. 9వ తరగతి చదువుతున్న ప్రేమ జంట ఆత్మహత్య !!

-

హైదరాబాద్‌ లో దారుణం చోటు చేసుకుంది. 14 ఏళ్లు ఉన్న ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శుక్ర వారం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే…. హైదరాబాద్‌ లోని కుత్బుల్లాపూర్ కు చెందిన పూజ (14) సురేందర్ (14)లు ఇద్దరు ప్రేమించుకున్నారు.

కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నారు ఈ ఇద్దరు విద్యార్థులు. అయితే.. వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ దానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.

ఈ నేపథ్యంలోనే… ప్రేమించుకుంటున్నారని తల్లిదండ్రులు మందలించడంతో సూసైడ్ చేసుకుంది ఈ జంట. పేట్ బషీరాబాద్ ఫాక్స్ సాగర్ లో దూకి ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. పూజ, సురేందర్ మృత దేహాలను స్వాధీనం చేసుకుని.. పోస్ట్‌ మార్టంకు తరలించారు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news