అత్తామామల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న అల్లుడు

-

అత్తామామలు, భర్త వేధింపులు తట్టుకోలేక మహిళలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మనం చూశాం. కానీ.. అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఓ అల్లుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనను ఎక్కడైనా చూశారా? లేదు కదా. కానీ.. హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో ఓ అల్లుడు.. అత్తామామల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల చంద్రశేఖర్.. హైదరాబాద్ లోని వనస్థలిపురానికి చెందిన సౌజన్యను రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. చంద్రశేఖర్ నగరంలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అయితే.. పెళ్లి తర్వాత కొన్నేళ్ల వరకు సజావుగా సాగిన వీళ్ల కాపురంలో గొడవలు ప్రారంభమయ్యాయి. రెండు నెలల క్రితం కూడా తన భార్య.. పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తమ కూతురుకు విడాకులు ఇచ్చేయాలంటూ చంద్రశేఖర్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు సౌజన్య తల్లిదండ్రులు. వారి వేధింపులు రోజురోజుకూ ఎక్కువవుతుండటంతో తట్టుకోలేక… తన తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. హైదరాబాద్ రావాలని తన తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్లు వచ్చి చూసేలోపు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు చంద్రశేఖర్. అతడి జేబులో దొరికిన సూసైడ్ నోట్ ప్రకారం.. తన అత్తమామల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని.. వాళ్లను కఠినంగా శిక్షించాలంటూ అందులో రాసి పెట్టి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news