పోలీసుల అదుపులో మునుగోడు లో కాల్పులకు పాల్పడ్డ సుఫారీ గ్యాంగ్

-

నల్గొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామంలో (గురువారం) కాల్పుల ఘటన కలకలం రేపింది. బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన నిమ్మల లింగస్వామి (32) అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అలాగే అతనికి వాటర్ బాటిల్స్ వ్యాపారం కూడా ఉంది. గత రాత్రి దుకాణం మూసేసి బ్రాహ్మణ వెల్లం లోని తన ఇంటికి బయలుదేరిన సమయంలో సింగారం శివారు దాటగానే గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి లింగస్వామి పై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.

దీంతో అతడు చనిపోయి ఉంటాడని భావించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లింగస్వామిని నార్కట్పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్పులకు పాల్పడ్డ ఇద్దరు సుపారీ గ్యాంగ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీలే కాల్పులకు కారణమా? లేదంటే వివాహేతర సంబంధమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లింగస్వామి భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news