కేసీఆర్ పై దామోదర రాజనర్సింహ సంచలన వ్యాఖ్యలు… మోస్ట్ కరెప్టెడ్ సీఎం కేసీఆర్ అంటూ…

-

మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత దామోదర్ రాజనర్సింహ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం కేసీఆర్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. కేంద్రానికి వ్యతిరేఖంగా నిలబడే ధైర్యం కేసీఆర్ కు లేదని విమర్శించారు. దేశంలోనే మోస్ట్ కరెప్టెడ్ సీఎం కేసీఆర్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు రాజనర్సింహ. తెలంగాణలో 4 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ అవినీతిపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉందో వారికే తెలియాలని కేంద్రం తీరును తప్పుబట్టారు. వరి ధాన్యం కొనుగోలు పేరుతో అధికార టీఆర్ఎస్ డైవర్ట్ రాజకీయాలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. రైతు సమస్యలపై, ప్రజా సమస్యలపై బీజేపీ, టీఆర్ఎస్ లు రాజకీయ కుట్రలు చేస్తూ ప్రజలని మభ్య పెడుతున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి మంచి తీర్పు ఇచ్చారని దామోదర్ రాజనర్సింహ అన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఇదే తీర్పు రిపీట్ కాబోతుందని రాజనర్సింహ జోస్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news