సీఎం జగన్, అవినాశ్ రెడ్డి తనను, తన కుటుంబాన్ని ఏమైనా చేస్తారనే భయం : దస్తగిరి

-

దస్తగిరి, వైఎస్ వివేకానంద హత్య కేసులో అప్రూవర్ గా మారిన విశాతం తెలిసిందే. అయితే , తాజాగా దస్తగిరి జగన్ మరియు అవినాష్ రెడ్డి ల పై సంచలన వైకాయలు చేపట్టారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి జగన్, ఎంపీ అవినాశ్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు దస్తగిరి. తనను, తన కుటుంబాన్ని ఏమైనా చేస్తారనే భయం తనకు ఉందని అన్నారు. అవినాశ్ రెడ్డి మనుషులు తనను అనుసరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు దస్తగిరి. ఈ నేపధ్యం లో కడప ఎస్పీ కార్యాలయంలో దస్తగిరి ఫిర్యాదు చేశారు.

తనకు, తన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని ఆయన కోరారు.  వివేకా కూతురు సునీత నుంచి తాను డబ్బులు తీసుకున్నట్టు అవినాశ్ రెడ్డి పదేపదే ఆరోపిస్తున్నారని తెలిపారు. తాను అమ్ముడుపోయానని నిరూపిస్తే జైలు శిక్షకు సిద్ధమని, నిరూపించకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేసి జైలుకు వెళ్తారా? అని అడిగారు. తనకు ప్రాణహాని ఉందనే విషయాన్ని సీబీఐ ఎస్పీ, రాయలసీమ రేంజ్ డీఐజీకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా వినతులు అందజేస్తానని తెలియచేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version