టీమ్ ఇండియా ఫ్యాన్​కి సారీ చెప్పిన వార్నర్​

-

ఆస్ట్రేలియా స్టార్ హిట్టర్ డేవిడ్ వార్నర్​కు ఇండియన్ క్రికెటర్లు అన్నా.. ఇండియన్ ఫ్యాన్స్ అన్నా.. ఇండియన్ సినిమాలన్నా పిచ్చి. ఈ బ్యాటర్ సోషల్ మీడియాలో అకౌంట్లలో సగానికి పైగా ఇండియన్ ఎంటర్​టైన్​మెంట్​కి సంబంధించిన పోస్టులే ఉంటాయంటే అతిశయోక్తి కాదు. వార్నర్ ఇండియన్ ఫ్యాన్స్​తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. అయితే తాజాగా ఈ ఆసీస్ బ్యాటర్ ఓ ఇండియన్ అభిమానికి సారీ చెప్పాడు. ఫ్యాన్​కి సారీ చెప్పేంత తప్పు వార్నర్ ఏం చేశాడు..? ఇంతకీ ఏం జరిగింది..?

వరల్డ్ కప్ ముందు జరుగుతోన్న భారత్-ఆస్ట్రేలియా సిరీస్​కు డేవిడ్ వార్నర్ దూరంగా ఉన్నాడు. ఈ మ్యాచ్​ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ‘ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు?.. కమాన్​ ఆస్ట్రేలియా’ అని కోహ్లీ ఉన్న ఫొటో ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశాడు వార్నర్​. దీనికి ఓ టీమ్​ ఇండియా అభిమాని రిప్లై ఇస్తూ..’ కెప్టెన్​ రోహిత్ శర్మ.. కోహ్లీ కాదు’ చెప్పాడు.

దీనికి స్పందించిన డేవిడ్ వార్నర్.. ‘నాకు తెలుసు.. సారీ’ అని సమాధానమిచ్చాడు. దీంతో ఈ విషయం ఇప్పుడు వైరల్ మారింది. దీంతో వార్నర్​ స్వభావాన్ని అందరూ పొగుడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news