BREAKING : కట్నం తీసుకునే వారికి భారీ షాక్..

-

తెలంగాణాలో సంచలన విషయం ఒకటి చర్చలోకి రావడంతో వైరల్ గా మారింది. నేటి కాలంలో వరకట్నం కోసం గృహహింస కేసులు ఎక్కువగా మారాయి. ఈ హింసను తట్టుకోలేని న్దరో అమాయక గృహిణులు చావే శరణ్యం అనుకుంటూ ప్రాణాలు వదులుతున్నారు. కాగా వీటిని కొంతమేరకు అయినా ఆపాలన్న మంచి ఉద్దేశ్యంతో మానవవనరుల కేంద్రంలో సీనియర్ ఫాకల్టీ గా ఉన్న శ్రీనివాస్ ఈ విషయంపై అధ్యయనం చేసి ఒక మంచి ప్రతిపాదనను తీసుకువచ్చారు. ఇకపై కట్నం తీసుకుంటే డిగ్రీ సర్టిఫికెట్ ను రద్దు చేసే విధానాన్ని అమలులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. శ్రీనివాస్ ఈ ప్రతిపాదనను రాష్ట్ర మహిళా కమిషన్ కు పంపగా.. వారు కూడా దీనిపై సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది.

కాగా త్వరలోనే ఈ విధానానికి సంబంధించి పూర్తి విధివిధానాలను రెడీ చేయనున్నారట. కాబట్టి ఇకపై కట్నం తీసుకునే వారు భయపడే విధంగా ఇది ఉండనుంది. కనీసం ఇలాంటి వాటితో అయినా మహిళలపై గృహహింస భారం తగ్గుతుందని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news