ఇవాళ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో, సన్‌ రైజర్స్ ఢీ

-

కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ 2021 రెండో భాగం మ్యాచ్‌ లు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ రెండో సీజన్‌ లో రెండు మ్యాచ్‌ లు పూర్తి అయ్యాయి. మొదటి మ్యాచ్‌ లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు దుమ్ము లేపంగా… నిన్న జరిగిన రెండో మ్యాచ్‌ లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు… సూపర్‌ విక్టరీ ని అందుకుంది.

ఇక ఐపీఎల్‌ 2021 లో ఇవాళ ఢీల్లి క్యాపిటల్స్‌తో…సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. దుబాయి వేదికగా రాత్రి ఏడున్నరకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన SRH కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. దీంతో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇప్పటి నుంచి ఆడుతున్న ప్రతి మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉండగా…. కుర్రాళ్లతో పటిష్టంగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టబోతుంది సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ జట్టు. ఇక ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టాస్‌ ప్రక్రియ ఏడు గంటలకు జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version