రూ.200కోట్ల మనీలాండరింగ్​ కేసు.. స్టార్​ నటిపై పోలీసుల ప్రశ్నల వర్షం

-

మనీలాండరింగ్​ కేసులో సుకేశ్ చంద్రశేఖర్‌ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ.200కోట్ల దోపిడీ కేసులో బాలీవుడ్‌ నటి నోరా ఫతేహీని దిల్లీ పోలీసులు ప్రశ్నించారు. దిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం.. ఆమెను నాలుగు గంటల పాటు ప్రశ్నించినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ కేసులో గతంలోనూ నోరా ఫతేహీ విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మరో బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌తో పాటు నోరా ఫతేహీకి కూడా సుకేశ్ ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు ఈడీ విచారణలో తేలింది. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అధికారులు గతంలో సుకేశ్, నోరాను ముఖాముఖీ కూర్చోబెట్టి విచారించారు. అందుకు సంబంధించిన వివరాలను ఈడీ తమ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.

అయితే డిసెంబరు 12, 2020కి ముందు తాను సుకేశ్‌తో మాట్లాడలేదని నోరా ఫతేహీ దర్యాప్తు అధికారులు తెలిపింది. కానీ, సుకేశ్ మాత్రం తాను నటితో మాట్లాడినట్లు చెప్పడం గమనార్హం. నోరాకు సుకేశ్‌ ఓ లగ్జరీ బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. అయితే ఈ కారును తాను తిరిగిచ్చేసినట్లు నటి విచారణ సమయంలో చెప్పింది.

 

రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్​సింగ్​, శివిందర్​సింగ్‌కు బెయిల్​ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేశాడు సుకేశ్​చంద్రశేఖర్​. తర్వాత బెయిల్‌ విషయాన్ని దాటవేస్తుండటంతో.. శివిందర్​ సింగ్​ భార్య అదితి సింగ్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు 2021లో సుకేశ్‌ను అరెస్టు చేశారు. అయితే సుకేశ్‌కు పలువురు బాలీవుడ్‌ నటీనటులతో సన్నిహిత సంబంధాలున్నాయని విచారణలో తేలింది. నటి జాక్వెలిన్‌కు సుకేశ్ దాదాపు రూ.10కోట్ల విలువైన ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ కేసులో ఆమెను కూడా నిందితురాలిగా పేర్కొంటూ ఈడీ ఇటీవల అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో విచారణకు రావాలంటూ ఇటీవల దిల్లీ పోలీసులు జాక్వెలిన్‌కు సమన్లు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news