శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనం టికెట్లు పెంచుతూ టీటీడీ కీలక నిర్ణయం

-

తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్న భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడి. శ్రీవారిని దర్శించుకునే వారికి ఇబ్బందులు లేకుండా దర్శనం టికెట్లు పెంచుతున్నట్లు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 16 నుంకచి తిరుపతిలో సర్వ దర్శనం టికెట్లు జారీ చేస్తామని.. కరెంట్ బుకింగ్ ద్వారా రోజుకు 10,000 టికెట్లు ఇస్తామని అంది. ఆన్ లైన్ లోనూ టికెట్ల జారీ కొనసాగుతుందని పేర్కొంది. ఇక టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ. కోటి విరాళమిచ్చిన వారికి ఈనెల 16న ఉదయాస్తమాన టికెట్లు కేటాయిస్తామని చెప్పింది.

కరోనా కారణంగా గత కొంత కాలం నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు గతంలో భారీ వర్షాల కారణంగా వెంకన్న దర్శనానికి బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో మళ్లీ యథావిధిగా దర్శనాలకు భక్తులు వస్తున్నారు. దీంతో టీటీడీ కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కరోనా వ్యాప్తి తగ్గడంతోనే ప్రస్తుతం దర్శన టికెట్లు పెంచాలని నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news