BREAKING NEWS: డీహెచ్ శ్రీనివాస్ రావుకు కరోనా పాజిటివ్

-

తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్ రావుకు కరోనా పాజిటివ్ గా తేలింది. డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ డిపార్ట్ మెంట్ కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. ఎప్పుడూ… రాష్ట్ర ప్రజల్ని అలెర్ట్ చేసే డీహెచ్ కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ ప్రజలను కరోనా ముందు జాగ్రత్తలు చెప్పే డీహెచ్ శ్రీనివాస్ రావుకు స్వల్ప స్థాయి లక్షణాలు ఉండటంతో కరోనా టెస్ట్ చేయించుకోవడం కరోనా పాజిటివ్ గా తేలింది.

తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో.. వైద్యాధికారులతో పాటు డీహెచ్ కూడా పలు ఆస్పత్రుల్లో పర్యటించారు. జిల్లాల్లో కూడా పర్యటనలు చేశారు. దీంతో వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ నేపథ్యంలోనే డీహెచ్ కు కరోనా సోకిందని తెలుస్తోంది. అయితే స్వల్ప లక్షణాలు  ఉండటంతో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన వాళ్లు కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు డీహెచ్.

Read more RELATED
Recommended to you

Latest news