టీ కాంగ్రెస్ నేతలకు దిగ్విజయ్ సింగ్ మూడు ప్రశ్నలు.. ఏంటంటే..?

-

తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఏఐసీసీ దూతగా సీనియర్‌నేత దిగ్విజయ్‌ సింగ్‌ గాంధీభవన్‌కు వచ్చారు. ఉదయం నుంచి సీనియర్‌ నేతలను పిలిపించి మాట్లాడుతున్నారు. పార్టీలో కీలక పదవుల్లో ఉన్న నేతలు కూడా కమిటీలపై అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని దిగ్విజయ్‌ తీవ్రంగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఏవైనా సమస్యలు ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలని సూచించారు. నేతల అభిప్రాయాలను ఆయనే స్వయంగా నమోదు చేసుకున్నారు. అందరితో ఒకేసారి కాకుండా ఒక్కొక్కరితో ప్రత్యేకంగా సమావేశమై చర్చిస్తున్నారు.

‘‘పార్టీలో జూనియర్‌, సీనియర్‌ పంచాయితీ మంచిది కాదు. సమస్యలు ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలి.. మీడియా ముందు మాట్లాడటం సరికాదు. కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఎవరు ఏం చేస్తున్నారో అధిష్ఠానం గమనిస్తోంది. ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే .. హై కమాండ్‌ చూస్తూ ఊరుకోదు. బీఆర్‌ఎస్‌ను ఓడించడానికి మీ దగ్గర ఉన్న వ్యూహం ఏమిటి? పార్టీ బలోపేతం కోసం మీ పాత్ర ఏంటి.. మీరు ఏం చేశారు? అంతర్గత సమస్యపై మీ అభిప్రాయం .. పరిష్కారం కోసం మీ సలహా ఏంటి?’’ అని దిగ్విజయ్‌ సింగ్‌ నేతలను ప్రశ్నించినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version