అదే జరిగితే ‘ఎఫ్ త్రీ’ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది… దిల్ రాజు..!

-

ఆశిష్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా రౌడీ బాయ్స్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన థియేటర్ లలో విడుదలైంది. ఈ సినిమా థియేటర్ ల దగ్గర పర్వాలేదు అనే టాక్ ను సంపాదించుకొని పర్వాలేదు అనే రేంజ్ లో కలెక్షన్ లను కూడా రాబట్టింది. ఆశిష్‌ హీరోగా పరిచయం అయిన మొదటి మూవీ రెండో వారం పూర్తయ్యేసరికి 12 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టడం చాలా సంతోషంగా ఉంది. మూడోవారం పూర్తయ్యేసరికి ఈ సినిమా 15 కోట్ల గ్రాస్‌ సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఓ కొత్త హీరోకి ఈ స్థాయిలో కలెక్షన్స్‌ రావడం అంటే సాధారణ విషయం కాదు అని రౌడీ బాయ్స్ సినిమా మా అంచనాలను అందుకుంది అని దిల్ రాజు తెలియజేశారు.

అయితే తాజాగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ ల సమావేశంలో ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ… వచ్చే నెల మూడో వారం నుంచి కరోనా తీవ్రత తగ్గి పెద్ద సినిమాల విడుదలకు మార్గం సుగమం అవుతుంది అని ఆశిస్తున్నాం. కారోనా తీవ్రత కారణంగానే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు రెండు విడుదల తేదీలను చిత్ర బృందం ప్రకటించింది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం ప్రకటించిన రెండు విడుదల తేదీలలో ఈ సినిమా మార్చి 18 వ తేదీన కాకుండా ఒకవేళ ఏప్రిల్ 28 వ తేదీన విడుదల కావాల్సిన పరిస్థితులు వచ్చినట్లయితే ‘ఎఫ్ త్రీ’ సినిమా వాయిదా పడవచ్చు అని దిల్ రాజు తెలియజేశాడు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా అయినా ‘ఆర్ఆర్ఆర్’ కు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అలాగే ఏపీలోని సినిమా టికెట్‌ ధరల సవరణ గురించి ఫిబ్రవరిలోపు పరిష్కారం లభిస్తుందనే నమ్ముతున్నాను అని దిల్ రాజు అన్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సుల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయి అని దిల్ రాజు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news