పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు భేటీ

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గతకొన్ని రోజులుగా తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆన్లైన్ టికెట్ల విధానం నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గా వివాదం చెలరేగుతోంది. టాలీవుడ్ పెద్దలు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ పిలుపు ఇవ్వగా… దానిని పూర్తిగా వ్యతిరేకించారు టాలీవుడ్ పెద్దలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపారు టాలీవుడ్ పెద్దలు. దీంతో పవన్ కళ్యాణ్ పరిస్థితి దారుణంగా తయారయింది. ఇలాంటి నేపథ్యంలో… తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టాలీవుడ్ పెద్దలు హైదరాబాదులో కలిసారు.

పవన్ కళ్యాణ్ ను ఈ రోజు ఉదయం టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీ రెడ్డి, సునీల్ నారంగ్, బన్నీ వాసు లు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్ర పరిశ్రమ కు సంభందించిన సమస్యల గురించి సృహృద్భావ వాతావరణంలో వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అంతే కాదు.. రాజకీయాల్లోకి చిత్ర పరిశ్రమను అస్సలు లాగొద్దని పవన్ కళ్యాణ్ ను నిర్మాతలు కోరినట్లు సమాచారం. దీనికి పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version