FLASH : దర్శకుడు నిషికాంత్‌ ఇంకా బ్ర‌తికే ఉన్నాడు: రితేష్ దేశ్‌ముఖ్..!

-

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు నిషికాంత్‌ కామత్‌ అనారోగ్యంతో చనిపోయారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై హీరో రితేష్ దేశ్‌ముఖ్ ట్విట్ట‌ర్ వేదికగా స్పందించారు. నిషికాంత్‌ ఇంకా బ్ర‌తికే ఉన్నాడ‌ని ఆయన తెలిపారు. ప్ర‌స్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని, చనిపోలేదని రితేష్ ట్వీట్ చేశారు. అందరు కలిసి నిషికాంత్‌ కోలుకోవాల‌ని ప్రార్ధిద్దాం అంటూ రితేష్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, అనారోగ్యంతో ఆయన ఇటీవల  హైదరాబాద్‌ గచ్చిబౌళిలో ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈరోజు తుది శ్వాస విడిచారన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే నిషికాంత్‌ మలయాళ హిట్‌ ‘దృశ్యం’ హిందీ రీమేక్‌కి దర్శకత్వం వహించారు‌. అలాగే ‘ముంబై మేరీ జాన్, ఫోర్స్, లై భారీ’ వంటి సినిమాలకు కూడా వహించారు‌. అలాగే ‘హవా ఆనే దే’ అనే హిందీ చిత్రంలో, ‘సాచ్య ఆట ఘరాట్‌’ అనే మరాఠీ సినిమాలో, ‘రాకీ హ్యాండ్సమ్‌’ అనే సినిమాలో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news