BREAKING : డైరెక్టర్ తేజకు కరోనా పాజిటివ్..!

-

సాధారణ ప్రజల తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు,సినిమా ఇండస్ట్రీకి చెందినవారు  సైతం కరోనా భారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ఇండస్ట్రీకి చెందినవారు కరోనా తో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా.. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. దీంతో ఆయన హోం క్వారంటైన్‌కు వెళ్లారు. అయితే తేజ గతవారం ఓ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం ముంబైకి వెళ్లొచ్చాడు.

అక్కడే ఆయనకు కరోనా వైరస్ సోకి ఉండవచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తేజ కుటుంబ సభ్యులకు, చిత్ర యూనిట్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందరికీ కరోనా నెగెటివ్ అని వచ్చింది. కాగా టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు రాజమౌళికి కూడా పాజిటివ్ అని తేలింది. మరోవైపు సీరియల్ నటీనటులు కూడా వ్యాధిబారిన పడుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news