మా ఓపికను పరీక్షించద్దు…ఖబర్దార్: ఎంపీ సోయం బాపూరావు

-

ఖబర్దార్ కేసీఆర్..మా ఓపికను చేతగానితనంగా భావించవద్దని, బిజెపి కార్యకర్తలు తిరగబడితే తట్టుకోలేవు, అని కెసిఆర్ ని హెచ్చరించారు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు. ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కు వస్తున్న స్పందన చూసి టీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఈ యాత్రతో టీఆర్ఎస్ నేతల కాళ్ల కింద భూమి కదులుతోంది. అక్కసుతో ప్రజా సంగ్రామ యాత్రను ఎట్లయినా అడ్డుకోవాలని కొంతమంది చిల్లరగాళ్లకు మందు తాగించి పంపిస్తున్నారు అని అన్నారు. కొందరు చెంచాగాళ్లు, కేసీఆర్ మోచేతి నీళ్లు తాగే నాయకులు అడ్డుకున్నంత మాత్రాన ప్రజా సంగ్రామ యాత్ర ఆగదు.

ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుండి కుట్రలు చేస్తున్నారనే విషయాన్ని బండి సంజయ్ ముందే పసిగట్టి బయటపెట్టిన రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిందే అన్నారు ఎంపీ సోయం.కేసీఆర్… ఖబడ్దార్…. బండి సంజయ్ కనుసైగ చేస్తే చాలు… బీజేపీ కార్యకర్తలు తిరగబడతారు. మా పార్టీ కార్యకర్తలు తిరగబడితే టీఆర్ఎస్ ఉంటదా? అని మండిపడ్డారు.

కానీ మా అధ్యక్షులు బండి సంజయ్ లక్ష్యం ఇది కాదు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, కేసీఆర్ ప్రభుత్వం గత 8 ఏళ్లుగా తెలంగాణ ఫ్రజలను చేస్తున్న మోసాలను బయటపెట్టడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నారు.అందుకే మేం సంయమనంతో ఉన్నాం. మా ఓపికను చేతగానితనంగా భావించొద్దని హెచ్చరిస్తున్నా. టీఆర్ఎస్ చిల్లరగాళ్ల కారు కూతలు, చిల్లర చేష్టలతో బీజేపీని ఏమీ చేయలేరని గుర్తుంచుకోవాలని ఘాటైన విమర్శలు చేశారు ఎంపీ సోయం బాపూరావు.

Read more RELATED
Recommended to you

Latest news