రంగులు మారుతున్న శివలింగం ఎక్కడ ఉందో తెలుసా..?

-

ప్రపంచంలోని ప్రముఖ ఆలయాలలో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతుంటాయి..అందులో కొన్ని జనాలను ఆలోచనలో పడవేస్తుంది.అలాంటిదే ఓ శివలింగం చరిత్ర. ఆ శివలింగంకు 850 ఏళ్ళ చరిత్ర ఉంది. ఆ లింగం రోజుకు మూడు రంగులలో భక్తులకు దర్షనమిస్తుందని చరిత్ర చెబుతుంది.ఆ శివలింగం సుమారు 850 సంవత్సరాల నాటిదని చెబుతారు. ఆగ్రాలోని శంసాబాద్ రోడ్డులోని రాజ్‌చుంగి సమీపంలో ఉన్న రాజేశ్వర ఆలయానికి సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం ఈరోజు తెలుసుకుందాం..

ఆగ్రా నగరంలో రాజేశ్వరాలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజ్ మహల్‌కు ప్రసిద్ధి చెందిన ఈ నగరంలో నాలుగు దిక్కులలో వివిధ శివాలయాలు ఉన్నాయి. వీటిని ఆగ్రాలోని చార్ ధామ్ అంటారు. ఈ ఆలయాలలో ఉన్న మహాదేవుడు తాజనగరిని నాలుగు దిక్కులనూ రక్షిస్తాడని నమ్ముతారు. ఈ నాలుగు ఆలయాలలో రాజేశ్వరాలయం కూడా ఒకటి. ఈ నాలుగు ఆలయాలకు భిన్నమైన లక్షణాలు, నమ్మకాలు ఉన్నాయి. ఈ దేవాలయాలలో హృదయపూర్వకంగా ఏ కోరికనైనా శివయ్యకు చెబితే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతారు..

అతను ఈ శివలింగాన్ని నర్మదా నది దగ్గర నుండి తీసుకొచ్చి రాజ్‌ఖేడాలో స్థాపించాలనుకున్నాడు. అయితే రాత్రి రాజ్‌పూర్ ఆక్ట్రాయ్ ప్రాంతంలో విశ్రాంతి కోసం బస చేశారు. అప్పుడు అతని కలలో శివుడు కనిపించి లింగాన్ని ఇక్కడే ప్రతిష్టించమని చెబుతాడు..ఆ వడ్డీ వ్యాపారి తనకు వచ్చిన కలను నమ్మలేదు. మరుసటి రోజు అతను ఎద్దుల బండిపై శివలింగాన్ని పెట్టి.. అక్కడ నుంచి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాలనుకున్నాడు.

అలా ఎంత సేపు ఎద్దుల బండిని ముందుకు కదిలించాలని చూసినా.. ఆ ఎద్దుల బండి ఆ ప్రదేశం నుండి కదలలేదు. శివలింగం అక్కడ నుండి పడిపోయింది.. తనకు తానే ఆ ప్రాంతంలో ప్రతిష్టించబడింది..ఆ తర్వాత లింగాన్ని ఎంత లేపినా లేవదు..అప్పుడాయనకి ఇది మహాదేవుని ఆజ్ఞ అని అర్థమైంది. ఆ తర్వాత శివలింగం పడిన చోటే ఆలయాన్ని నిర్మించారు..అలా ఆ ప్రాంతాన్ని రాజేశ్వర మహాదేవ అని పిలుస్తారు. ఈ శివలింగం రోజుకు మూడుసార్లు రంగు మారుతుంది. ఉదయం తెల్లగా, మధ్యాహ్నం లేత నీలం రంగులో,రాత్రి లేత గులాబీ రంగులో ఉంటుంది.. ఆ వింతను చూడటానికి ప్రతి ఏటా శ్రావణ మాసం సోమవారం, శివరాత్రి పర్వదినాల్లో వేలాది మంది భక్తులు వస్తారు..

Read more RELATED
Recommended to you

Latest news