క్యాసినోకు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు.. కాల్​గర్ల్స్​తో చీకోటి ఆతిథ్యం!

-

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన క్యాసినో వ్యవహారంలో తవ్వుతున్నకొద్ది ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ.. ఆరు నెలల క్రితం శ్రీలంకలో జరిగిన క్యాసినోలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు గుర్తించింది. పేకాట రాయుళ్లు ఒక్కో టేబుల్‌పై రూ.3 కోట్లు పెట్టి ఆడినట్లు దర్యాప్తులో తేలింది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఉన్నట్లు.. హావాలా మార్గంలో వారు డబ్బులు తరలిస్తున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

ఇక్కడ నగదు ఇస్తే క్యాసినోలో చీకోటి ప్రవీణ్‌ కాయిన్స్‌ సమకూరుస్తున్నట్లు తెలిపారు. బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, సినీ రంగానికి చెందిన వారిని ప్రవీణ్‌ తరచూ క్యాసినోకు తీసుకువెళ్లేవాడని చెప్పారు. కాల్‌ గర్ల్స్‌తో వారికి ప్రవీణ్‌ అండ్‌ గ్యాంగ్ ఆతిథ్యం ఏర్పాటు చేసేవారని వెల్లడించారు. ఇండోనేషియా, థాయిలాండ్‌, నేపాల్‌లోనూ రూ.కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

ప్రవీణ్, మాధవరెడ్డి బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ.25 కోట్ల లావాదేవీలను ఈడీ అధికారులు గుర్తించారు. పలువురు రాజకీయ నాయకులు, అధికారులకు సైతం ప్రవీణ్, మాధవరెడ్డి ఖాతాల నుంచి నగదు బదిలీ చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. దీంతో ఈ లావాదేవీలకు సంబంధించిన వివరాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఇప్పటి వరకు ఏడుగురికి నోటీసులు జారీ చేశారు. క్యాసినో ఏజెంట్లు ప్రవీణ్, మాధవరెడ్డితో పాటు విమానాల ఆపరేటర్ సంపత్ సహా మరో నలుగురు హవాలా ఏజెంట్లకు నోటీసులు ఇచ్చారు. సోమవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news