జగన్ డబ్బు ఎక్కడ ఉందో సత్య కుమార్ ప్రజలకు చూపించాలి – వి శ్రీనివాసరావు

-

జగన్ డబ్బు ఎక్కడ ఉందో సత్యకుమార్ ప్రజలకు చూపించాలని అన్నారు ఏపీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు.ఏపీలో వరదలు బీభత్సం సృష్టిస్తే ఇప్పటి వరకు కేంద్రం సహాయం అందించలేదని,కేంద్రం తీరు అన్యాయంగా ఉందని మండిపడ్డారు.పార్లమెంట్ లో ప్రజా సమస్యల పై పోరాడుతుంటే కనీసం వైసిపి మాట్లాడటం లేదన్నారు.రాష్ట్ర ప్రయోజనాలను వైసిపి కేంద్రానికి తాకట్టు పెట్టిందన్నారు శ్రీనివాస రావు.నెరస్తులే జడ్జి స్థానంలో ఉన్నట్లుగా బిజెపి వైఖరి ఉందన్నారు.

రాజధానికి నిధులు ఇవ్వకుండా మేము అధికారంలోకి వస్తే రాజధాని కడతామంటున్నారని అన్నారు.రాజధాని అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.సోము వీర్రాజుని రైతులు నిలదీస్తే పారిపోయారని ఎద్దేవా చేశారు.కేంద్రం జగన్ మోహన్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేస్తోందన్నారు. జగన్ డబ్బు ఎక్కడ ఉందో సత్యకుమార్ ప్రజలకు చూపించాలన్నారు శ్రీనివాసరావు.
కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం నుంచి నిధులు రాబట్టకుండా ప్రజలపై భారాలు వేస్తున్నారని మండిపడ్డారు.

నూతన విద్యా విధానం పై ఏపీ ప్రభుత్వం ఏక పక్షంగా వ్యవహరిస్తుందన్నారు.వైద్య రంగంలో ఇచ్చిన హామీలు అమలు పరచడం లేదన్నారు శ్రీనివాసరావు.ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని అరెస్టు లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news