కేసీఆర్ ప్రభుత్వం కుప్ప కూలబోతుంది : ఈటల రాజేందర్

-

ఎప్పుడూ ఎన్నికలు వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందని.. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతి పంటను కొనుగోలు చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటన చేశారు. కేసీఆర్ బీజేపీ మీద ఉన్న కోపాన్ని రైతుల మీద చూపెడుతున్నారు.. దాన్యం సేకరణ కు డబ్బులన్ని కేంద్రమే ఇస్తుంది… రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏజెన్సీ గా మాత్రమే పనిచేస్తుందని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం రంగంలో దేశంలోనే అత్యంత గందరగోళ పరిస్థితిలో ఉందని.. ధాన్యం సేకరణ కొత్తగా వచ్చింది కాదు దశాబ్దాలుగా కొనసాగుతుందని చెప్పారు.

etala

వ్యవసాయం లో విప్లవాత్మక మార్పులు వచ్చాక పంట పెరిగిందని.. ఫుడ్ కార్పొరేషన్ రెండు విధానాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. డీసీపీ పద్ధతిని తెలంగాణ రాష్ట్రం ఎంచుకుని ధాన్యాన్ని ఇస్తుందని.. ముందు చూపు లేక చిన్న చూపు చూడటం వల్లే సమస్య ఉత్పన్నం అవుతుందన్నారు.

పార్టీ ఆఫీసుల మీద దాడులు, ధర్నాలు చేస్తారా? వడ్లు పండించి పార్టీ కార్యాలయం,ఇళ్ల ముందు పోస్తామని కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. వరి వేయవద్దంటే.. రైతుల పరిస్థితి ఏమి కావాలని.. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అంటివి కేసీఆర్ ఏమైంది ? అని నిలదీశారు. కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఎక్కడా చెప్పలేదు.. రాష్ట్ర రైతాంగం ప్రయోజనాల కోసం తెలంగాణ బీజేపీ కృషి చేస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news