చర్మం వలిచి చెప్పులు కుట్టించినా ప్రజల రుణం తీర్చుకోలేను- ఈటెల రాజేందర్

-

హుజూరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ డబ్బు సంచుల్ని, మద్యం సీసాలను పంచినా హుజూరాబాద్ ప్రజలు న్యాయం, ధర్మం వైపు నిలబడ్డారని,  ఈ గెలుపు హుజూరాబాద్ ప్రజలదని ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ ప్రజల కోరికను హుజూరాబాద్ ప్రజలు నెరవేర్చారని తన గెలుపు గురించి అన్నారు. తోలు వలిచి చెప్పులు కట్టించినా… హుజూరాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనని ఈటెల రాజేందర్ అన్నారు. కేసీఆర్కు ప్రజలన్నా.. ప్రజాస్వామ్యం అన్నా లెక్కలేదని విమర్శించారు. మధ్యం సీసాలు, డబ్బు సంచులతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. చిన్న ఉద్యోగస్తున్ని  కూడా తమకు మద్దతు ఇవ్వాలని హుకూం జారీ చేసి అరాచకం స్రుష్టించారని అన్నారు. ఎన్నికల కమీషన్ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించలేదని.. స్వయంగా పోలీసులే డబ్బు సంచులకు ఎస్కార్ట్ గా ఉండి పంచారని విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో కనీసం స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఆరు నెలలుగా హుజూరాబాద్ ప్రజలతో పాటు నేను అనేక బాధను అనుభవించానని అన్నారు. టీఆర్ఎస్ ఎన్ని స్కీములు తీసుకువచ్చినా.. దళితబంధును తీసుకువచ్చినా ప్రజలు నమ్మలేదని, అది కూడా తమ రాజేందర్ వల్లే వచ్చిందని దళితులు అనుకుంటున్నారని వివరించారు. ప్రభుత్వం ఇప్పటికైాన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని, నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని, దళితబంధు ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news