అమిత్ షా.. చెప్పింది చేసి చూపించారు.. మహారాష్ట్ర సీఎం శిందే వ్యాఖ్యలు

-

శివసేన పార్టీ, ఎన్నికల గుర్తు మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్ శిందే వర్గానికే చెందుతాయని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిన విషయం తెలిసింది. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే సీఎం శిందే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వెనుక రాయిలా నిలబడతానని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాటిచ్చారని.. దాన్ని ఆయన నిలబెట్టుకున్నారని ఏక్‌నాథ్‌ శిందే అన్నారు.

‘‘శిందేజీ మీరు ధైర్యంగా ముందుకెళ్లండి అని అమిత్‌ షా నాతో చెప్పారు. మేం మీ వెనకాల రాయిలా నిలబడతాం. ఆయన ఏం చెప్పారో అదే చేశారు’’ అని శనివారం సాయంత్రం పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో శిందే అన్నారు. గత ఏడాది జూన్‌లో ఏక్‌నాథ్‌ శిందే అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ ఆఘాడీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శిందే వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయ వర్గంలో సంచలనం రేకెత్తిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news