రెండోఇన్నింగ్స్ లో ఇండియా చిత్తు.. ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే !

-

లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్ మరియు ఇండియా రెండో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ మ్యాచ్ మొదట్లో పట్టుబిగించిన ఇంగ్లాండ్ జట్టు… ఇప్పుడు కాస్త తగ్గింది. ఇక టు టీమ్ ఇండియా ఈ మ్యాచ్ లో మళ్లీ లైన్ లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో… ఎనిమిది వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇంకా ఈ రెండో ఇన్నింగ్స్ లో… పూజారా 45 పరుగులు, మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అజింక్య రహానే 61 పరుగులు, మరియు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సమి 56 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు.

ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో… మార్క్ వుడ్ మూడు వికెట్లు తీసి ఇండియా జట్టు నడ్డి విరిచారు. ఇక ఇది ఇలా ఉండగా…. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు గెలవాలంటే…. 272 పరుగులు చేయాల్సి ఉంది. ఆట చివరి రోజు కావడంతో…. ఈ మ్యాచ్ కూడా డ్రా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అటు … ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 6 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం జో రూట్ మరియు హమీద్ క్రీజులో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news